తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,211..మొత్తం మృతుల సంఖ్య 1,107
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు నమోదుకాగా మరో ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,87,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 1,107మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,56,431మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 297, కరీంనగర్ 152, రంగారెడ్డిలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. హోం ఐసోలేషన్లో 24,054 మంది ఉన్నారు. ఇప్పటివరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని, రికవరీ రేటు 83.55 శాతంగా ఉందని వివరించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/