ట్రంప్ హాజరైన సమావేశంలో పాల్గొన్న వ్యక్తికి ‘కరోనా’ పాజిటివ్
న్యూజెర్సీలో ప్రత్యేక పరీక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ ఉన్నతస్థాయి సమావేశంలో హాజరైన వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని ధృవీకరించారు.. ఆ వ్యక్తి ట్రంప్ చెంతకు రాలేదని వైట్హౌస్ వెల్లడించింది..
ఇదిలా ఉండగా ట్రంప్ హాజరైన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సిపిఎసి) వైట్హౌస్కు 20 కిలోమీటర్ల దూరంలోనే మేరీ ల్యాండ్ జరిగిందని, ఇది అతిపెద్ద రాజకీయసమావేశంగా నిర్వాహకులు తెలిపారు..
ఇందుకు హాజరైన ఓ వ్యక్తికి కరోనా సోకిందని, అతడికి న్యూజెర్సీలో ప్రత్యేక పరీక్షలు జరుపుతున్నామని వారు వెల్లడించారు..
50 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావటంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు మేయర్ మురియెల్ బౌసర్ పేర్కొన్నారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/