18 రాష్ట్రాలలో కరోనా అంత తీవ్రంగా లేదు
కేంద్ర గణాంకాల ప్రకారం ఆయా రాష్ట్రాలలో తీవ్రత తక్కువగా ఉందని వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికి కూడా 18 రాష్ట్రాలలో కరోనా ప్రభావం అంతగా లేదని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. దేశ పెరుగుదల రేటుతో పోలిస్తే ఈ రాష్ట్రాలలోతీవ్రత తక్కువగా ఉందని ఇందులో ప్రధానంగా కేరళ రాష్ట్రంలో అతి తక్కువ శాతం కరోనా కేసులు నమోదు అవుతున్నాయని తెలిపింది. కాగా అత్యధికంగా మహరాష్ట్రలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ తరువాత ఢిల్లీ, గుజరాత్, మద్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లాంటి రాష్ట్రాలు మినహ మిగతా వాటిలో అంత తీవ్రంగా లేదని తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/