తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా
ఇద్దరు వైద్యులు, కుత్బుల్లాపూర్కు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి కరోని పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది. నేడు ఇద్దరు వైద్యులకు, కుత్బుల్లాపూర్కు చెందిన 49 ఏళ్ళ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/