దేశంలో కొత్తగా 74, 383 మందికి కరోనా
కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 74వేల 383 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో 918 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70లక్షలు దాటేసింది.
మొత్తంకరోనా కేసులు 70లక్షల 53వేల 807 కు చేరగా, కరోనా మృతుల సంఖ్య లక్షా 8 వేల 334కు పెరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/