తెలంగాణలో 20 మంది చిన్న పిల్లలకు కరోనా

ప్రత్యేక ట్రీట్మెంట్‌ చేస్తున్న వైద్యులు

corona virus
corona virus

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 644 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉండడం ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. వీరంతా కూడా 12 ఏళ్లలోపు వారే. ఇందులొ 23 రోజుల చిన్నారినుంచి 12 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఉన్నారు. వీరందరిని గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందులో మూడేళ్లు ఉన్న ఓ బాలుడికి ఇతర సమస్యలు ఉండడంతో అతనికి వైద్యం చేయడం డాక్టర్‌లకు సవాల్‌గా మరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/