ఇటలీని కుదిపేస్తున్నకరోనా..ఒక్క రోజులో 475 మంది మృతి

ఇటలీలో 2,978కి చేరుకున్న మృతుల సంఖ్య

Italy 475 new coronavirus deaths in a day
Italy 475 new coronavirus deaths in a day

ఇటలీ: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అక్కడ తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు ఇటలీలో ఈవైరస్‌ తన పంజా విసురుతుంది. 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 475 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా మరణాలతో కలిపి ఇటలీలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,978కి చేరుకుంది. బాధితుల సంఖ్య 35,713కు చేరుకుంది. ఇక, కోవిడ్19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మరోవైపు, కరోనా వైరస్‌పై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. దేశంలో ఎవరికీ కరోనా సోకలేదని వివరించింది. వూహాన్, హుబేయి ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/