అమెరికాలో భారీగా కరోనా మరణాలు
ఒక్కరోజులోనే 2వేలమంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విజృంభిస్తుంది. కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 2వేల మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి గణాంకాలు పేర్కోన్నాయి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 18,637 చేరింది. ఒక్కరోజులోనే అమెరికాలో కోత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్లు తెలిపింది. దింతో కరోనా భాధితుల సంఖ్య 5లక్షలకు చేరుకుంది. కాగా న్యూయార్క్ నగరంలోనే 777 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/