తెలంగాణలో పోలీస్ అకాడమీకి కరోనా సెగ
124 మందికి కరోనా నిర్ధారణ
Hyderabad: తెలంగాణలో పోలీస్ అకాడమీకి కూడా కరోనా సెగ తగిలింది. అకాడమీకి చెందిన 124 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కరోనా సోకిన వారిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
కరోనా సోకిన వారందరినీ క్వారంటైన్ చేసిన అధికారులు అకాడమీలో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అకాడమీలో 1900 మంది శిక్షణ పొందుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/