తెలంగాణలో కరోనా విశ్వరూపం
24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిదిలో 505, మేడ్చల్లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్లో 303, సంగారెడ్డిలో 175 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గురువారం రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర విద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. .రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 కు చేరింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/