దేశంలో 24 గంటల్లో 43,071 కరోనా కేసులు
955 మంది కరోనాతో మృతి
New Delhi: దేశంలో గడచిన 24 గంటల్లో 43,071 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు చేరింది. శనివారం 955 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,02,005కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,58,078 మంది కోలుకున్నారు. మొత్తం 35,12,21,306 వ్యాక్సిన్ డోసులు వేశారు. 4,85,350 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/