ఏపీలో 22,517 కొత్త కేసులు: మృతులు 98
కరోనా విజృంభణ
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజుకు 20 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. 24గంటల్లో మొత్తం 89,535 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 22,517 కొత్త కేసులు తేలాయి. అంటే కాకుండా 98 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 12, నెల్లూరులో 11 ,తూర్పు గోదావరిలో 10 ,విశాఖపట్నం లో 9, విజయనగరంలో 9, చిత్తూరులో 8 ,శ్రీకాకుళంలో 8, గుంటూరు ,పశ్చిమ గోదావరి 7, కృష్ణా , కర్నూలు , ప్రకాశం 5, కడప లో ఇరువురు మృతి చెందారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/