ఏపిలో 955కు చేరిన కరోనా కేసులు

ఒక్కరోజులో 62 కొత్త కేసులు నమోదు

doctors
doctors

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటలలో జరిపిన పరీక్షల్లో కొత్తగా మరో 62 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 955 కు చేరుకుంది. కొత్తగా నమోదు అయిన కేసులలో కర్నూలు జిల్లాలో 27, గుంటూరు జిలాలొ 11, అనంతపురంలో 4, తూ.గో జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 14 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 29 మంది మృతి చెందగా.. 145 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 781 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 261 కరోనా కేసులు నమోదు కాగా. గుంటూరు జిల్లాలో 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/