ఏపిలో 813 కు చేరిన కరోనా కేసులు
కొత్తగా 56 కేసులు వెలుగులోకి
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడం లేదు . గడిచిన 24 గంటలలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 813 కు చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఈ వైరస్ బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా.. 120 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం 669 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అత్యధికంగా కర్నులు జిల్లాలో 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 177 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాఉ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/