ఏపిలో 603కు చేరిన కరోనా కేసులు

కొత్తగా మరో 31 మందికి కరోనా పాజిటివ్‌

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రినుంచి నేటి ఉదయం వరకు జరిపిన పరీక్షల్లో మరో 31 కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 603కు చేరుకుంది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో కృష్ణా జిల్లాలో 18, కర్నూలు జిల్లాలొ 5, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలొ 2, తూ.గో జిల్లాలో 2, ప.గో జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలపిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 15 మంది మృతి చెందగా .. 42 మంది ఈ వైరస్‌ నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 546 మంది ఆసుత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/