దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

24 గంటల్లో 53,480 నమోదు

Corona cases of concern in the country
Corona cases of concern in the country

New Delhi: దేశంలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. మరణాలు సైతం భారీగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 53,480 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 41,280 మంది కోలుకోగా.. వైరస్‌ ప్రభావంతో 354 మంది మృతి చెందారు.

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది. మొత్తం 1,62,468 మంది మృతి చెందారు. ప్రస్తుతం . టీకా డ్రైవ్‌లో భాగంగా 6,30,54,353 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. నిన్న ఒకే రోజు దేశంలో 10,22,915 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/