దేశంలో 446 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 9 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దీని వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు దేశంలో 446 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 9మంది దీని భారిన పడి మరణించారని కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/