పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు

అందరూ మాస్క్‌లు ధరించాలని వైద్యులు పిలుపు

Corona cases in West Bengal- People concerned
Corona cases in West Bengal- People concerned

Kolkata: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కేసులు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా అందరూ మాస్క్‌లు ధరించాలని వైద్యులు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నదని, ఇది కరోనా కేసులు పెరుగుదలకు కారణమయ్యేలా ఉన్నదన్నారు. 

మరోవైపు కోవిడ్ ఆసుపత్రులలో తగినంతగా పడకలు, వెంటిలేటర్ల లేవని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన వారం రోజులలో పశ్చిమ బెంగాల్‌లో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగిందని, చాలామందిలో మ్యూటెంట్ స్ట్రెయిన్ కూడా కనిపిస్తున్నదన్నారు. రెండవసారి కరోనాకు గురైనవారు కూడా ఉన్నారని తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/