దేశంలో కొత్తగా 69, 239 మందికి కరోనా
30లక్షల కరోనా కేసులు
New Delhi: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 69,239 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో 912 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30లక్షల 44వేల 941కి చేరింది.
కరోనా మృతుల సంఖ్య 56వేల706కు చేరుకుంది.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/