తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 1,986 కరోనా కేసులు
ఒక రోజులో గరిష్ట స్థాయిలో కేసులు నమోదు
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 1986 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒక రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అలాగే, గత 24 గంటలలో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు కరోనా కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 519కి పెరగ్గా, కేసుల సంఖ్య 62,703కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/