తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
శనివారం ఒక్క రోజే 1,321 కొత్త కేసులు నమోదు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గంట గంటకు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్క రోజే 1,321 కొత్త కేసులు నమోదు కావటం ప్రజల్లో ఆందోళన కల్గిస్తోంది. అంటే కాకుండా కరోనా కారణంగా మరో అయిదుగురు మృతి చెందారు ఇవాళ్టి వరకు తెలంగాణాలో రాష్ట్రంలో 3,12,410కు కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 1,717 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 7,923 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. . ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/