తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలకలం
24 గంటల్లో కొత్తగా 684 పాజిటివ్ కేసులు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరింది. తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య 1,697కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,01,227 మంది కోలుకున్నారు. 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 184 పాజిటివ్స్ ఉండటం విశేషం… మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన జారీచేసింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/