కొత్తగా 214 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,92,835
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 214 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,586కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/