భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88లక్షల 14వేల 579
మృతుల సంఖ్య లక్షా 29 వేల 635
New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 41, 100 మందికి కరోనా సోకింది.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88లక్షల 14వేల, 579కి చేరింది. అలాగే గత 24 గంటల్లో కరోనా కారణంగా 447 మంది మృత్యువాత పడ్డారు.
దీంతో కరోనా మృతుల సంఖ్య లక్షా 29 వేల 635కి పెరిగింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/