రికార్డు స్థాయిలో 4,12,262 కరోనా కేసులు
3,980 మంది మృతి
New Delhi: దేశంలో కరోనా కేసులు రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో మొదటి సారి అత్యధికంగా 4 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 4,12,262 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,980మంది మృతి చెందారు.కరోనా తో ఒక్కరోజులోనే ఇలా మరణించటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/