ఏపీలో కరోనా కేసులు
రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళన
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
రాష్ట్రంలో ఇంత వరకూ 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు.
అత్యధికంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకూ 126 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
గుంటూరులో కరోనా కాటుకు నలుగురు మరణించగా, కర్నూలులో ఇద్దరు మరణించారు.
జిల్లాలకు సంబంధించి పాజిటివ్ కేసులు, మరణాలు ఇలా వున్నాయి
- అనంతపురం 26 02
- చిత్తూరు 28 00
- తూ.గోదావరి 17 00
- గుంటూరు 126 04
- కడప 37 00
- కృష్ణా 52 04
- కర్నూలు 126 02
- నెల్లూరు 64 02
- ప్రకాశం 42 00
- శ్రీకాకుళం 00 00
- విశాఖ 20 00
- విజయనగరం 00 00
- ప.గోదావరి 34 00
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/