తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
కొత్తగా 2,474 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత అధికమైంది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 2,474 మందికి కరోనా సోకింది.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 1వేయి 865.
కరోనా కారణంగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 7గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 744కు పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/