భారత్లో 14వేలు దాటిన కరోనా కేసులు
ఒక్కరోజులోనే 991 కొత్త కేసులు వెలుగులోకి
దిల్లీ: దేశంలో కరోనా మహామ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నయి. నిన్న ఒక్క రోజే దేశంలో 991కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోన భాధితుల సంఖ్య 14,378కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ భారీన పడి 480 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కాగా దీని భారినుండి 1,992 మంది కోలుకోగా.. ప్రస్తుతం 11,906 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది ఇక్కడ 3,323 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరణాలు 201కు చేరుకున్నాయి. దిల్లీలో 1,707. తమిళనాడులో 1,323. రాజస్థాన్లో 1,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో 572, తెలంగాణలో 766 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/