భారత్లో ఆరువేలు దాటిన కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజరోజుకు పెరుగిపోతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 6,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 504 మంది కరోనా నుండి కోలుకున్నారని, 199 మంది ఈ వైరస్ కారణంగా మరణించారని పేర్కోన్నది. ప్రస్తుతం 5,709 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. కాగా గత 24 గంటలలో దేశంలో ఈ వైరస్ కారణంగా 33 మంది మరణించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/