తెలంగాణలో మరో 1,676 కొత్త కేసులు

మొత్తం కేసులు సంఖ్య 41,018

corona virus
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ‌ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,676 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 41,018 కేసులు నమోదు కాగా, వీటిలో 13,328 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,295కి పెరిగింది. కరోనా బారినపడిన 10 మంది నిన్న మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 396కు పెరిగింది. తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 67 శాతం ఉండడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,22,693 నమూనాలు పరీక్షించగా, నిన్న 14,027 శాంపిళ్లు పరీక్షించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/