భారత్‌లో పదివేలకు చేరువలో కరోనా కేసులు

308 కు చేరిన మరణాలు

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 9,152 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 857 మంది ఈ వైరస్‌ బారినుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 7,987 మంది ప్రస్తుతం వివిధ ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కోంది. కాగా ఈ వైరస్‌ కారణంగా దేశంలో 308 మంది మరణించినట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదు కాగా, ఢిల్లీ , తమిళనాడు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కుసులు వెయ్యి దాటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/