భారత్లో అధికమవుతున్న కరోనా కేసులు
ఒక్కరోజులోనే 1,118 పాజిటివ్ కేసులు నమోదు
దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య పన్నెండు వేలకు చేరువయింది. నిన్న ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1,118 కరోనా పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతొ దేశవ్యాప్తంగా కరోనా భాధితుల సంఖ్య 11,933 కు చేరింది. గడచిన 24 గంటలలో ఈ వైరస్ కారణంగా దేశంలో 39 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 392 కు చేరింది. కాగా ఇప్పటివరకు ఈ వైరస్ బారినుండి 1,343 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. 10,197 కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/