గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు అధికం
నిబంధనలు పాటించకపోవటమే కారణం!
Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. జిహెచ్ఎంసి నుంచి కనీసం లో 150 నుంచి 200 వరకు కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో 15 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. .గ్రేటర్ పరిధిలో అధికంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, చార్మినార్, ఎల్బీనగర్ ఏరియాలలో కేసులు నమోదవుతున్నాయి.మాస్క్ లు పెట్టుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరగటం.. కేసులు పెరుగుదలకు కారణంగా హెచ్చరిస్తున్నారు,
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/