ప్రమాద ఘంటికలు : రోజుకూ లక్షకు పైగా కేసులు
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ వెల్లడి
New Delhi: దేశంలో ప్రతి రోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోడు కావటం ఆందోళన కల్గిస్తోంది. .24 గంటల్లో 1,26,789 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా ధాటికి 685 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. కాగా ఇప్పటివరకు దేశంలోమొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది. 1,66,862 మంది మృతి చెందారు. ఇదిలావుండగా దేశ వ్యాప్తంగా 9,01,98,673 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/