కరోనా బారినపడిన తమిళ కమెడియన్ వడివేలు

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టడం..ప్రజలంతా వాక్సిన్ లు వేసుకుంటుండడం తో ఇక కరోనా మహమ్మారి పోయినట్లే అని అంత అనుకున్నారు. కానీ నవంబర్ చివరి వారం నుండి మళ్లీ కేసులు నమోదు కావడం ..రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం తో మళ్లీ ప్రజలు భయం పడుతున్నారు. ఇదే క్రమంలో ఓమిక్రాన్ అనే కొత్త రకం కరోనా వెలుగులోకి రావడం తో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా తమిళ కమెడియన్ వడివేలు కరోనా బారినపడ్డారు.

తాజాగా లండన్ లో షూటింగ్ ముగించుకొని..వచ్చాక ఆయన ఆరోగ్యం కాస్త అస్వ‌స్థ‌త‌కు గురైందట. దీంతో ఆయ‌న‌కు ఇవాళ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆయనకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న‌ను పోరూర్ లోని ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. అంతేకాదు.. ఆయ‌న లండ‌న్ నుంచి రావ‌డంతో… ఒమిక్రాన్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. రేపు ఆ రిపోర్టులు వ‌చ్చే ఛాన్స్ ఉంది. మరి ఇది కరోనా మాత్రమేనా..ఓమిక్రాన్ ఏమైనా సోకిందా అనేది రేపు తెలుస్తుంది. ‘నాయి శేఖర్ రిటర్న్స్’ అనే సినిమాకు లోకేషన్ల, ఆర్టిస్టుల ఎంపిక కోసం వడివేలు, డైరెక్టర్ సూరజ్, నిర్మాత లైకా ఉమేశ్ లండన్ వెళ్లారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వడివేలులో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ , నటుడు విక్రమ్ లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.