కరోనా బారినపడ్డ హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వదల్లేదు. ఇంకా పలువురు రాజకీయ , బిజినెస్ నేతలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు కరోనా బారినపడ్డారు.

రీసెంట్ గా జరిగిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను 40 స్థానాల్లో గెలిచింది. దాంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ ఆనందంలో ఉండగానే ఆయన కరోనాకు చిక్కారు.