తెలంగాణ ‘మండలి’లో కరోనా కలకలం

ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు పాజిటివ్

MLC Puranam Satish

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ ఉద‌యం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో స‌తీష్‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. శ‌నివారం ఎమ్మెల్సీ స‌తీష్‌ మండ‌లికి హాజ‌రై బ‌డ్జెట్‌పై మాట్లాడారు.

దీంతో మిగ‌తా మండ‌లి స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌భ్యులంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/