వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంపు

తెలంగాణ, ఏపీలో వెయ్యి దాటేసిన సిలిండర్ ధర

cooking-gas-cylinder-price-increase

న్యూఢిల్లీ: దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు షాకిచ్చాయి. వంటగ్యాస్ ధరలను భారీగా పెంచేసింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 పెంచేసింది. ఫలితంగా తెలంగాణలో సిలిండిర్ రూ. 1,002కి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది రూ. 1008గా ఉంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.

5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349కి పెరగ్గా, 10 కేజీల కాంపోటిజట్ బాటిల్ ధర రూ. 669కి చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2033.50కి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో గ్యాస్ ధరలు పెరగడం అక్టోబరు తర్వాత ఇదే తొలిసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/