కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా
ఎమ్మెల్యే ‘కోమటిరెడ్డి’ వెల్లడి
Hyderabad: కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను కాంగ్రెస్ మనిషినేనని ఆయన అన్నారు.
హైకమాండ్ నిర్ణయాలు సరిగ్గా లేవనే బిజెపికి అనుకూలంగా మాట్లాడానని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్నంత వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని, పార్టీ వీడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
ప్రభుత్వాన్ని తిడితేనే హీరోలు కాబోరని, మంచి పనులు చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించాలని ఆయన అన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాలన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/