ఏపీ సర్కార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు
Amaravati ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికలకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని రమేష్ కుమార్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ రాసిన లేఖపైనా ప్రభుత్వం స్పందించలేదని, సీఎస్ స్పందన కూడా సరిగా లేదని ఈ పిటిషన్ లో తెలిపారు.
ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ ఎన్నికలు సాఫీగా జరిగేలా ఏపీ సర్కారుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/