ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కానిస్టేబుల్‌

శంషాబాద్ ఎయిర్ పోర్టు పిస్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అశాయ్య అనే కానిస్టేబుల్ ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అశాయ్య ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక అశాయ్య విషయానికి వస్తే..వికారాబాద్ జిల్లా ఎన్నికతల స్వగ్రామం ఇతనిది. నిన్న ఉదయం 10 గంటలకు డ్యూటీ కోసం శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. ఇతను 24 గంటలు డ్యూటీ అయిపోవడంతో రిలీవర్ గణేష్ వచ్చి చూడగా ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శంషాబాద్ పోలీసులు వచ్చి ఆత్మహత్య సంఘటన స్థలంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు మొదలుపెట్టారు.