సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హత్యకు కుట్ర..

JD Lakshmi Narayana
JD Lakshmi Narayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. తనను హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతుందని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయితీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజాసేవకన్నా వ్యక్తిగత స్వార్థం.. అవినీతి పెరిగిందని , నిజాయతీగా ఉండాలని నిర్ణయించుకున్న వారికి కష్టాలు తప్పవని.. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఎరుపు ఇంకుతో బెదిరింపు రాసిన లేఖలు వచ్చిన సందర్భాలున్నాయి అని గుర్తు చేసుకున్నారు. పెద్ద తిమింగలాలు వలలో పడవు.. వాటిపై దృష్టిసారించి రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు కృషి జరగాలి అని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్లాలంటే సిగ్గుపడేవాళ్లమని.. చక్కగా టీచర్లు పాఠాలు చెబుతున్నా ట్యూషన్ అంటే సిగ్గుగా ఉండేదన్నారు. ఇప్పుడు మాత్రం ఓపెన్‌గా వెళుతున్నారన్నారు.

అవినీతిని ఎలా తగ్గించాలన్న దానిపై ఆలోచించాలని.. ఆదాయ పన్నుశాఖలో వ్యక్తులు కలుసుకునే అవసరం లేకుండా ఆన్‌లైన్‌ విధానం తెచ్చారని గుర్తు చేశారు. ఇలా సాంకేతికత అవినీతిని తగ్గించే లక్ష్యంతో ఉండాలి అన్నారు. ఒకప్పుడు అవినీతిపరుడు భయంగా తిరిగేవాడని.. ఇప్పుడు నిజాయితీ పరుడు భయంతో తిరగాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది అన్నారు. ప్రజాసేవ కన్నా వ్యక్తిగత స్వార్థం ఏ సమాజంలో ప్రాధాన్యత పొందుతుందో ఆ సమాజం అవనితి బరువుతో నాశనం అవుతుందన్నారు.