సచిన్‌ పార్టీలోనే ఉండాలని రాహుల్‌ కోరుకుంటున్నారు

వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: సచిన్‌ పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈనేపథ్యంలోనే సచిన్ పైలట్ పై ఘాటు విమర్శలు వద్దని సిఎం అశోక్ గెహ్లాట్ కు ఆయన సూచించారని, సచిన్ పైలట్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని అన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో, వారిద్దరి మధ్యా దూరం పెరుగుతూ ఉంటే, అది రాజస్థాన్ లో పార్టీకి నష్టం కలిగిస్తుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి సచిన్ పైలట్ ను రాహుల్ గాంధీ ఇంతవరకూ కలవలేదు సరికదా, ఆయనతో మాట్లాడ లేదని తెలుస్తోంది. అయితే, ప్రియాంకా గాంధీ మాత్రం కల్పించుకుని సచిన్ పైలట్ తో రెండు మూడు సార్లు మాట్లాడారు. ఇప్పుడిక నిర్ణయం తీసుకోవాల్సింది సచిన్ పైలట్ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వదులుకోవాలని మాత్రం భావించడం లేదని పార్టీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి.
కాగా నిన్న అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ బిజెపితో సచిన్ పైలట్ హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారని సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/