నేడు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
న్యూఢిల్లీ: నేడు సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ద్రవ్యోల్బణం సమస్యను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
అలాగే కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లోనే కాకుండా బహిరంగ వేదికల్లో కూడా ‘కరోనా మేనేజ్మెంట్’ అంశంపై లేవనెత్తాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర లేఖ రాయనున్నారు. ప్రతి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/