వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనుః జగ్గారెడ్డి
తన బదులుగా పార్టీ కార్యకర్తను బరిలోకి దించుతానని వెల్లడి
హైదరాబాద్ః తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తను బరిలోకి దించుతానని ఆయన మరో ఆసక్తికర ప్రకటన చేశారు. తన సతీమణి నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే… తన స్థానంలో తన సతీమణిని పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి… 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/