గవర్నర్‌ తమిళిసైతో టి.కాంగ్రెస్‌ నేతల భేటి

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో భేటి అయ్యారు. మంథనిలో హై‌కోర్టు న్యాయవాదుల జంట వామన్‌రావ్, నాగమణిల దారుణ హత్యలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/