తెలంగాణలో కరోనాతో కాంగ్రెస్ నేత మృతి
హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబీకులు, అనుచరులు, ఆప్తులు, బంధువులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాగా.. ఇటీవల గాంధీభవన్లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/