సిఎం కెసిఆర్ కు జగ్గారెడ్డి లేఖ
డిమాండ్లు.. నెరవేర్చకపోతే నిరాహార దీక్షే
హైదరాబాద్: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. లాక్డౌన్ వల్ల పేద, మధ్య తరగతి, వివిధ వర్గాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో సిఎం కెసిఆర్ లేఖ రాశారు. ఇండస్ట్రీస్ కూడా మూతపడటం వల్ల కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందరిని ఆదుకోవాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 9వ తేదీన తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
జగ్గారెడ్డి డిమాండ్లు …
• గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఒక సంవత్సరం రద్దు చేయాలి. మినహాయించాలి.
• కరెంట్ బిల్లులు ప్రజల వద్ద ఆరు నెలల వరకు ప్రభుత్వం రద్దు చేయాలి.
• పట్టణాల్లో కిరాయి ఇంట్లో నివసిస్తున్న కిరాయి దారులకు 6 నెలల వరకు కిరాయి చెల్లించాలి.
• ప్రజలు EMI కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే 6 నెలల EMI కూడా ప్రభుత్వమే చెల్లించాలి.
•నీటి బిల్లులు ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం వసూలు చేయొద్దు.
• ఇండస్ట్రీల వద్ద కూడా 6 నెలల వరకు కరెంట్ బిల్లులు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రకటించాలి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/