కాంగ్రెస్‌కు పీకేలాంటి వాళ్ల అవసరం లేదు : ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పీకేలూ అవ‌స‌రం లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. ‘ఆజ్‌తక్’ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు తానిచ్చిన లీడర్‌షిప్ ఫార్ములాలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పేర్లు కానీ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో మరి మూడోపేరు ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు.. దానిగురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి పీకే లాంటి వాళ్ల అవసరం లేదని, ఆ పార్టీ నిర్ణయాలను తీసుకోగలదని అన్నారు.

‘‘మీడియా నన్ను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోంది. నా స్థాయి అంత పెద్దది కాదు. రాహుల్ గాంధీ నాపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాంగ్రెస్‌కు పీకే అవసరం లేదు. అది తన సొంత నిర్ణయాలను తీసుకోగలదు’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని, అలా ముందుకెళ్లాలా? వద్దా? అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పీకే వివరించారు. కాగా, రాహుల్ గాంధీ అనుభ‌విస్తున్న హోదాను తాను అడిగిన‌ట్లు వస్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని పీకే స్ప‌ష్టం చేశారు. రాహుల్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/