క‌న్యాకుమారిలో రాహుల్‌కు ఘ‌న స్వాగ‌తం..ప్రారంభం కానున్న భార‌త్ జోడో యాత్ర‌

క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా భార‌త్ జోడో యాత్ర‌

Congress Bharat Jodo Yatra Live: Rahul Gandhi arrives in Kanyakumari, to launch rally shortly

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ 2024 జరుగనున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశం మొత్తాన్ని చుట్టేసేలా ఓ భారీ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భార‌త్ జోడో యాత్ర పేరిట క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా సాగే ఈ యాత్ర మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించింది.

భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ కాసేప‌టి క్రిత‌మే త‌మిళ‌నాడులోని కన్యాకుమారికి చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను సమీక్షించిన రాహుల్‌… ఏర్పాట్ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ 3,500 కీలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేయ‌నున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/